రామగుండం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌‌‌‌‌  :  ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

రామగుండం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌‌‌‌‌  :  ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్​ పెట్టినట్టు ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆదివారం గోదావరి ఒడ్డున గల సమ్మక్క జాతర స్థలంలో రూ.3 కోట్ల సింగరేణి నిధులతో సీసీ రోడ్లు, షెడ్లు, ఎకో పార్క్​, స్నానఘట్టాలు, సైడ్​ వాల్స్​, టాయిలెట్స్​, తదితర నిర్మాణాలకు జీఎం లలిత్​కుమార్​తో కలిసి భూమిపూజ చేశారు.

అలాగే ఓసీపీ 5 పక్కన గల కబరస్థాన్​లో రూ.98 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు క్యాంప్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 148 మంది కల్యాణలక్ష్మి, 23 మంది షాదీముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం నిర్వహించిన ఇఫ్తార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.