రామగుండం అభివృద్ధిపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్​

రామగుండం అభివృద్ధిపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఇందులో భాగంగానే టౌన్‌‌‌‌‌‌‌‌లోని జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్​తెలిపారు. శుక్రవారం గోదావరిఖనిలోని తిలక్​నగర్ జంక్షన్​ వెడల్పు కోసం భూమిపూజ చేశారు. అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లు, పలు దుకాణాలను కూల్చివేయగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్​ నడుపుతూ మట్టిని చదును చేశారు. జంక్షన్ల వెడల్పుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

ప్రజలంతా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. అనంతరం విఠల్​ నగర్​ పార్క్​ వద్ద, పరుశురామ్‌‌‌‌‌‌‌‌నగర్​ హనుమాన్​ టెంపుల్​ వద్ద రూ.20 లక్షల సింగరేణి నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వాటర్​ప్లాంట్లను మేయర్​ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్​, జీఎం లలిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో లీడర్లు ఆరెల్లి పోచం, రాంమోహన్, కిరణ్​బాబు, మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్​, పెద్దెల్లి ప్రకాశ్, శ్రీనివాస్​, రజిత, రవీందర్​, మౌనిక, రాజు, ఆంజనేయ ప్రసాద్​, కర్ణ పాల్గొన్నారు.