నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు అన్నారు. శనివారం ఆయన మెదక్​లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో స్టూడెంట్స్​ను ముంచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 2022 –23 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.1.70 కోట్ల స్కాలర్​షిప్​డబ్బులు ఉప ముఖ్యమంత్రి భట్టి చొరవతో మంజూరయ్యాయని పేర్కొన్నారు.

దీంతో జిల్లాలో 3 లక్షల 4 వేల మంది స్టూడెంట్స్​కు లబ్ధిచేకూరుతుందన్నారు. అలాగే జిల్లాలో బీసీ, ఎస్సీ కోటా కింద 3 లక్షల 4 వేల మంది స్టూడెంట్స్​కు రూ.1 కోటి 70 లక్షలు వారి ఖాతాలలో జమ అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు.