
మెదక్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు, స్టూడెంట్స్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్స్కీంను ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ అందరూ పేద కుటుంబాలకు చెందిన వారేనని.. వారు అర్ధాకాలితో స్కూల్కు రావడం వల్ల నీరిసించిపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ స్కీంను ప్రవేశపెట్టిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సౌజన్యంతో ప్రతిరోజూ మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్ అందిస్తారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ స్కీం ద్వారా జిల్లాలో 897 స్కూల్స్లో 84,554 మంది స్టూడెంట్స్కు లబ్ధి చేకూరతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్కు ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జునగౌడ్ , ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి , డీఈఓ రాధాకిషన్, డీఎస్ఓ రాజిరెడ్డి, ఎంఈఓ నీలకంఠం పాల్గొన్నారు.