
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. హెల్త్ సెంటర్ ఏర్పాటైతే గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల పల్లెల జనానికి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. త్వరలో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరవుతాయన్నారు. ఎమ్మెల్యే వెంట పంచాయతీ సెక్రటరీ హారిక, మండల సర్వేయర్ రత్నాకర్, అర్ఐ దశరథ్ తదితరులు ఉన్నారు.