
ఆర్మూర్, వెలుగు : ఇటీవల చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై దాడి జరుగగా గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి వెళ్లి పూజారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
హిందూ ఆలయాలు, పూజరులపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలకు బీజేపీ వ్యతిరేకమని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.