దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: మనోచేతన దివ్యాంగుల స్కూల్​అందిస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలోని మనోచేతన దివ్యాంగుల స్కూల్​లో  దాత ఇప్ప నిషికాంత్​రెడ్డితో కలిసి స్టూడెంట్స్​కు దుస్తుల పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానసిక వికలాంగులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారికి సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా చేయూతనందించాలని పిలుపునిచ్చారు. అనంతరం దొమ్మాట గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.