జానంపేటలో బస్టాండ్ నిర్మాణం పూర్తి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

జానంపేటలో బస్టాండ్ నిర్మాణం పూర్తి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
  • గ్రామస్తులను అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక, వెలుగు : పినపాక మండలం జానంపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్మించిన బస్టాండ్​ను గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాల కోసం గ్రామస్తులు చందాలు వేసుకుని సుమారు రూ.3లక్షలతో బస్టాండ్​ను నిర్మించడం అభినందనీయమన్నారు.  బస్టాండ్​ నిర్మాణం కోసం కృషి చేసిన పలువురిని ఆయన అభినందినంచారు.

అనంతరం పలువురు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాలతో సత్కరించారు.  జానంపేట, ఏడూళ్ళబయ్యారం గ్రామాల్లో ఇటీవల చనిపోయిన కాంగ్రెస్​ కార్యకర్తల కుటుంబాలను పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దారు నరేశ్, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్ఐ రాజ్​కుమార్​, కాంగ్రెస్​ నాయకులు పి.వెంకటేశ్వర్లు, కంది సుబ్చారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.