జగన్​పై హత్యాయత్నం కేసు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు

జగన్​పై హత్యాయత్నం కేసు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్‌‌‌‌ పీవీ.సునీల్‌‌‌‌ కుమార్‌‌‌‌పై కేసు నమోదయ్యింది. గుంటూరులో తనను కస్టడీకి తీసుకున్న టైమ్​లో హత్యాయత్నం చేశారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 120బి, 166, 167, 197, 307, 326, 465, 508 (34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 2021, మే 14న తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఆ ఫిర్యాదులో వెల్లడించారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్​ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్​ సీతారామాంజనేయులు, ఏ4 విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు.