
దుబ్బాక, వెలుగు : దుబ్బాక మండలం హబ్షీపూర్ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రఘునందన్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆవరణలో ఉన్న సంపు పై కప్పు లేకపోవడంతో పిల్లలు అందులో పడితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి సంప్ పై కప్పును సరి చేశారు. స్టూడెంట్స్ పట్ల టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు సాయంత్రం ఇచ్చే స్నాక్స్ ఎందుకు రావడంలేదని సీడీపీవో చంద్రకళను ఫోన్లో అడిగారు. దుబ్బాక ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు స్నాక్స్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ట్రై సైకిళ్ల పంపిణీ
అక్బర్పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. గ్రామస్తుల కోరిక మేరకు బొప్పాపూర్నుంచి దుబ్బాకకు వెళ్లే మూడు కిలో మీటర్ల రహదారికి సొంత నిధులు కేటాయించి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి తానే ఫీజు భరించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 29 నుంచి జూలై 5లోగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లైసెన్స్ లేని వ్యక్తులు ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, రెండు ఫొటోలను అందజేయాలని సూచించారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిషత్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొగుట మండలంలోని అన్ని గ్రామాల రోడ్డులను పూర్తి చేశామన్నారు. కన్గల్ గ్రామ రోడ్డుకు రూ.80 లక్షలు మంజూరయ్యాని చెప్పారు