
తొగుట, వెలుగు : అంగన్వాడీలు తొగుట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు గురువారం ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గృహలక్ష్మి, దళిత బంధు, బీసీలకు ఆర్థికసాయంలో అంగన్వాడీలకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన పద్మాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.