సాక్ష్యాల్లేవు.. కేసు కొట్టేయండి

సాక్ష్యాల్లేవు.. కేసు కొట్టేయండి
  • 2021లో ధర్నా కేసులో కోర్టును కోరిన రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ ఆఫీసు ముందు ధర్నాకు సంబంధిం చి 2021లో తమపై నమోదైన కేసు ను కొట్టేయాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్​ సహా 20 మంది హైకోర్టు ను ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని బీజేపీ నేతలు జీహెచ్​ఎంసీ ముందు  నిరసన వ్యక్తం చేశారన్నారు.  

అయితే, కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ సైఫాబాద్‌‌ ఎస్ఐ ఎం.తాజం రెడ్డి కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, కేసు కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న జడ్జి..విచార ణను ఈ నెల 21కి వాయిదా వేశారు.