ఆ ఇద్దరికీ సీఎం అయ్యే అర్హత ఉంది : రాజగోపాల్ రెడ్డి

ఆ ఇద్దరికీ సీఎం అయ్యే అర్హత ఉంది : రాజగోపాల్ రెడ్డి

సీఎం పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు.    నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు బ్లాక్ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.  

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము చేస్తున్న అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.  రానున్న మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు.  ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.  మళ్లీ బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితితుల్లో తెలంగాణ ప్రజలు లేరన్నారు.  వందకు వంద శాతం మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్నారు.