
- మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే రామారావు పటేల్ విజ్ఞప్తి
భైంసా, వెలుగు: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్లో మంత్రిని ఎమ్మెల్యే పటేల్కలిశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆలయానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులను వెనక్కి తీసుకుందన్నారు.
మళ్లీ యథావిధిగా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రసాద్ స్కీం ద్వారా వచ్చేలా చూడాలని మంత్రికి విన్నవించారు. అనంతరం ముథోల్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి వర్క్ఆర్డర్ ఇవ్వాలని కమిషనర్ను మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.