
జూలూరుపాడు, వెలుగు : వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండలపంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు సహయంతో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు విజయవంతంగా తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందకుపోతుందన్నారు. అనంతరం బేతాళపాడు గ్రామంలో భూక్య మహేశ్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాల్ల దుర్గాప్రసాద్, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల ఇన్చార్జి ఏనుగుల అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.