మెదక్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.-146 లక్షలతో స్రీట్ వెండర్ మార్కెట్,  మైనారిటీ కమ్యునిటీ హాల్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానన్నారు. టీయూడబ్ల్యుజేయూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​ చంద్రపాల్​, కౌన్సిలర్లు శేఖర్​, లింగం, లక్ష్మీ, లక్ష్మీ నారాయణగౌడ్​, వసంత్ రాజ్, సమీయొద్దీన్​, కో-ఆప్షన్​ మెంబర్​ గంగాధర్​, కాంగ్రెస్ నాయకులు పవన్, ఉమర్, మనోజ్​, ఆంజనేయలు, హఫీజొద్దీన్, రవి, అమర్, శివరామకృష్ణ, సూఫీ, వెంకట నారాయణ, భూపతి, తాహేర్ పాల్గొన్నారు.