మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే రోహిత్​ రావు​

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి  : ఎమ్మెల్యే రోహిత్​ రావు​

మెదక్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే రోహిత్ రావు​అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మహిళా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అనంతరం మహిళా డాక్టర్లు, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీహెచ్ శివదయాల్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​కిరణ్, డాక్టర్​శేఖర్​పాల్గొన్నారు.