ఫిబ్రవరి 24న నిజామాబాద్​కు సీఎం రేవంత్​రెడ్డి రాక : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

ఫిబ్రవరి 24న నిజామాబాద్​కు సీఎం రేవంత్​రెడ్డి రాక : ఎమ్మెల్యే  సుదర్శన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు :  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్​రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం కోసం 24న నిజామాబాద్​కు సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి తెలిపారు. శనివారం ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. బోర్గంలోని భూమారెడ్డి ఫంక్షన్​ హాల్​లో ఉదయం 11 గంటలకు నిర్వహించే మీటింగ్​లో రేవంత్​రెడ్డి పాల్గొంటారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నరేందర్​రెడ్డిని అన్ని కోణాల్లో ఆలోచించి పార్టీ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయిస్తుందన్నారు.  

రూ.30 కోట్ల నజరానా నిజమేనా..? 

కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​కు రూ.30 కోట్ల నజరానా ముట్టజెప్పాక గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ  స్థానంలో పోటీ చాన్స్​ దక్కిందని అంజిరెడ్డి కామెంట్స్​పై నోరు విప్పాలని రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి డిమాండ్​ చేశారు.  బీఆర్​ఎస్​ సపోర్టు కూడా తనకే ఉందని ఓటుకు రూ.2 వేల చొప్పున పంచడానికి రెడీ అంటున్న ఆయనకు బీజేపీ ఎంత డబ్బు ఇచ్చిందో వెల్లడించాలన్నారు. స్టేట్​ కోఆపరేటివ్​ డెవలప్​మెంట్​ లిమిటెడ్​ ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా ఛైర్మన్​ కేశవేణు, నరాల రత్నాకర్​, ఏబీశ్రీనివాస్​, జావెద్​ అక్రమ్​, విపుల్​గౌడ్​, వేణురాజ్​, రోహిత్​ ఉన్నారు.