
లింగంపేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మానవత్వం చాటుకున్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లకు చెందిన హన్మండ్లు సోమవారం తన మనుమరాలు అంకితను తాడ్వాయి హాస్టల్లో విడిచిపెట్టడానికి బైక్పై తీసుకెళ్తున్నాడు. లింగంపేట పోలీస్స్టేషన్సమీపంలో బైక్ అదుపుతప్పి ఇద్దరూ కింద పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సురేందర్ వారిని గమనించి, గాయపడ్డ తాతా మనువరాలిని తన వెహికల్లో లింగంపేటలోని ఓ హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ఇప్పించారు.