
- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
పిట్లం, వెలుగు: జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆదివారం బిచ్కుంద మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జుక్కల్ను అభివృద్ధిలో ముందు ఉంచడం కోసం పని చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మంజూరైన సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామానికి కొత్తగా మంజూరైన రేషన్ దుకాణాన్ని ప్రారంభించి కల్యాణలక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. తొలుత మద్నూర్ మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.