
వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని శుక్రవారం పరిశీలించి, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ మండలాల నేతలతో మాట్లాడి, జన సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.
అధికారులతో సమన్వయం చేస్తూ సీఎం సభను సక్సెస్ చేయాలని కోరారు. సీఎం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, వనపర్తిలో చదువుకునే సమయంలో అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటిని సందర్శించి, ఆమెతో మాట్లాడతారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు ఉన్నారు.