మహబూబ్ నగర్ జిల్లలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మహబూబ్ నగర్ జిల్లలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు :  పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్​బ్యాంక్​ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఫార్మసీని తనిఖీ చేసి, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. నియోజకవర్గంలోని పీహెచ్​సీల్లో నార్మల్  డెలివరీలు చేసేందుకు కావాల్సిన సిబ్బందిని  నియమించాలని డీఎంహెచ్ వోను అదేశించారు. మక్తల్ కు కేటాయించిన అంబులెన్స్ ను జిల్లా ఆసుపత్రికి ఎందుకు పంపించారని నిలదీశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా అంబులెన్స్​ను మక్తల్ కు కేటాయించాలన్నారు. డీఎంహెచ్​వో సౌభాగ్య లక్ష్మి, బాలకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రవి కుమార్ , గణేశ్​కుమార్  పాల్గొన్నారు.