
కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్లోని ఏఎంసీ–2 గ్రౌండ్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట మొదలైన క్రికెట్టోర్నమెంట్ ఫస్ట్మ్యాచ్లో బెల్లంపల్లి టీమ్15 రన్స్ తేడాతో నెన్నెల మండల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెల్లంపల్లి టీమ్20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
సాయి కృష్ణ 48 బాల్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 65 రన్స్ చేశాడు. కిషన్ 22, చిన్న, బీమాయుక్త చెరో14 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెన్నెల టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. రాజేశ్ మలోత్ 24 బాల్స్లో 34 రన్స్, సాయికుమార్ 21, అనిల్ గోలేటీ 18 పరుగులు చేశారు. బెల్లంపల్లి ఆటగాడు సాయికృష్ణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.