
కోల్ బెల్ట్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆర్టీసీ కార్గో ద్వారా పేరు నమోదు చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాలలో చెన్నూరు బస్ట్స్టాండ్ కార్గో ఇన్చార్జి బంధారుకంటి పున్నం, సిబ్బందిని ఎమ్మెల్యే కలిశారు. రాములోరి కల్యాణానికి భద్రాచలం వెళ్లలేని భక్తులు ఒక పాకెట్ కు రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను పొందవచ్చని వివేక్ తెలిపారు. ఈ నెల 18 వరకు ఆన్లైన్ లోనూ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. కార్గో సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి తలంబ్రాలను అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 8978756611 నంబర్ను సంప్రదించాలని ఆర్టీసీ కార్గో సిబ్బంది సూచించారు.