
నారాయణపేట, వెలుగు: దామరగిద్ద మండల పరిధిలో మల్రెడ్డి పల్లి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని జాతీయ మాలల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ గ్యాంగ్ హన్మంతు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ను కలిసి విన్నవించారు. శనివారం హైదరాబాద్లోని వివేక్ నివాసంలో కలిసి మాలల సమస్యలపై చర్చించారు. నారాయణపేటలో మాలల ఐక్యత కోసం పనిచేయాలని ఎమ్మెల్యే కోరినట్టు హన్మంతు తెలిపారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతకుముందు మాలలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించేటట్టు కృషి చేయాలని ఐక్య వేదిక రాష్ట్ర ఉపాద్యక్షుడు అవుల సుధీర్కుమార్, రాష్ట్ర కార్యదర్శి రంగాతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్కు కలిసి వినతిపత్రాన్ని అందించారు.