కోరుట్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్

కోరుట్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్

జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన అంజిరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామితో పాటు నర్సింగరావును పూలమాలతో సత్కరించారు నూతన పాలకవర్గ సభ్యులు.  

మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రమాణ స్వీకారం రోజు వర్షం కురవడం శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే వివేక్.  ఉప ప్రధాని అవుతాననుకుని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో  రైస్ మిల్లర్లు రైతుల దగ్గర ముక్కు పిండి వసూల్ చేశారన్నారు. మిల్లర్ల దగ్గర బీఆర్ఎస్ నేతలు కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  రైతు ప్రభుత్వమని చెప్పారు.  రైతు రుణమాఫీ చేసి నిజమైన ప్రజా పాలన చూపించింది కాంగ్రెస్ సర్కార్ అని అన్నారు వివేక్.