బాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జైపూర్​ మండల పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనార్యోగంతో బాధపడుతున్న వేలాల గ్రామానికి చెందిన  కాంగ్రెస్ లీడర్ నగేశ్​ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 

ఇటీవల అనారోగ్యంతో శివ్వారం మాజీ సర్పంచి గణేశ్​తల్లి చనిపోగా ఆయనను, పౌనూర్​కు చెందిన మంతెన కుమార్ అనే యువరైతు ఆత్మహత్య చేసుకోగా, అదే గ్రామానికి చెందిన రైతు కర్రు రాజయ్య తల్లి రాధమ్మ ఆనారోగ్యంతో చనిపోగా ఆ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. చెన్నూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్​కు సీఎం రిలీప్ ఫండ్​ చెక్కు అందజేశారు. ​