
కోల్బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ బూత్ ఇన్చార్జీలు, బూత్ మెంబర్లతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం సాయంత్రం మంచిర్యాలలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల తీరుపై చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మండల, పట్టణ, జైపూర్ మండలాలకు చెందిన ఇన్చార్జీలు, మెంబర్లతో రివ్యూ నిర్వహించారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి పలు సూచనలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, లీడర్లు పాల్గొన్నారు.