కొత్త టీపీసీసీ చీఫ్ను కలిసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కొత్త టీపీసీసీ చీఫ్ను కలిసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. శుక్రవారం (సెప్టెంబర్ 20, 2024) హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కొత్త బాస్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గంలో రాజకీయాంశాలపై చర్చించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ  ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కూడా ఉన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ పై చర్చించారు నేతలు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలు అయిన రైతులకు రుణమాఫీ, పారిశ్రామిక విధానాలు, ఫోర్త్ సిటీ నిర్మాణం, మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తదితర అంశాలను చర్చించారు ఈ భేటీలో.. 

ALSO READ | ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్