
కోల్ బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి చెరువు మీని ట్యాంక్బండ్పై గురువారం మున్సిపల్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాకర్స్అసోసియేషన్ప్రెసిడెంట్, స్థానిక కాంగ్రెస్ లీడర్ బండి సందానందం యాదవ్ వీటిని ప్రారంభించారు.
మీని ట్యాంక్బండ్ను సందర్శించినప్పుడు ఇక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారించాలని మున్సిపల్కమిషనర్ను ఆదేశించారన్నారు. ట్యాంక్ బండ్పరిసరాల్లో ఏపుగా పెరిగిన పొదలు, చెట్లను తొలగించి శుభ్రం చేశారని, మహిళా వాకర్స్కు సెక్యూరిటీ కోసం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.