జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వివేక్

జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వివేక్

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా  జరిగింది.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు  కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా అటెండయ్యారు.స్పోర్ట్స్ జర్నలిస్ట్ లందరు క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎక్కువ మంది జర్నలిస్ట్ లు క్రికెట్ ని మాత్రమే కవర్ చేస్తున్నారని చెప్పారు. క్రికెట్ తో పాటు అదర్ స్పోర్ట్స్ ని కూడా కవర్ చెయ్యాలని కోరారు. 

 తనను క్రికెట్ లోకి తీసుకొచ్చింది ఎమ్మెల్యే వివేక్ అని చెప్పారు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. MLA వివేక్ విలువైన సలహాలు, సూచనలతో  క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. అన్ని జ‌ట్ల‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

జూలై 20 నుంచి 5 రోజుల పాటు జర్నలిస్ట్ ప్రీమియ్ లీగ్ జరగనుంది. V6, వెలుగు తో సహా మొత్తం 10 జట్లు లీగ్ లో పాల్గొంటున్నాయి.  లీగ్ లో పాల్గొంటున్న టీంలకు జెర్సీలు అందించారు ఎమ్మెల్యే వివేక్, HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు.