పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి: మ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి: మ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి/ రాయపర్తి, వెలుగు: పెండింగ్​పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి ఝాన్సీరెడ్డితో కలిసి జనగామ కలెక్టర్ షేక్​ రిజ్వాన్​ బాషాతో మంగళవారం కలెక్టరేట్​లో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ పనులపై సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టాల గురించి ఆరా తీసారు. దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇండ్ల పనులు సత్వరమే పూర్తిచేసి, అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే వెంట పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాధ్యక్షులు తదితరులున్నారు. వరంగల్​జిల్లా రాయపర్తి రైతువేదికలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్​ఎఫ్​చెక్కులను పంపిణీ చేశారు. ​అనంతరం మండల కేంద్రంలోని చెరువును పరిశీలించారు.  అధికారులతో మాట్లాడి చెరువు కలుషితం కాకుండా చూడాలన్నారు. తిర్మలాయపల్లి కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించి, వసతలపై స్టూడెంట్స్​తో మాట్లాడారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు అమ్యానాయక్ ఉన్నారు.