పాలకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : యశస్వినిరెడ్డి

పాలకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : యశస్వినిరెడ్డి

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు : అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పెరగూడెంలో నూతన గ్రంథాలయాన్ని, ఎల్బీ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మన ఊరు–మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అవుతాపురం, చిట్యాల గ్రామాలను సందర్శించి సమస్యలపై ఆరా తీసి, అర్జీలు స్వీకరించారు.

వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే మన ఊరు–మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.