కాంగ్రెస్​తోనే సామాజిక న్యాయం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్​తోనే సామాజిక న్యాయం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: కాంగ్రెస్​తోనే సామాజిక న్యాయం సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన కార్యక్రమంలో ముడా చైర్మన్ గా లక్ష్మణ్ యాదవ్  ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు  సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో ఎవరికి స్వేచ్ఛ లేదని, కానీ, కాంగ్రెస్  ప్రభుత్వంలో   నాయకులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. పదవులు ఇవ్వడమే కాకుండా, పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, భవిష్యత్​లోనూ అన్ని వర్గాలు, కులాలు, మతాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మహబూబ్ నగర్  అభివృద్ధికి కృషి చేస్తామని 
చెప్పారు.