పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బల్మూరి వెంకట్​

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బల్మూరి వెంకట్​
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​

నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. మంగళవారం డిచ్​పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్​లో నిర్వహించిన జిల్లా సంస్థాగత మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికే పోస్టులు ఇవ్వాలనే హైకమాండ్ ఆదేశాలను అందరూ గౌరవించాలన్నారు. పార్టీ కోసం పని చేస్తే ప్రతి కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కుతాయన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. 

పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి సెగ్మెంట్​కు పది వేల ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.  గత బీఆర్ఎస్​ప్రభుత్వం డబుల్ బెడ్​ రూం ఇండ్ల పేర్లతో కమీషన్లు వసూలు చేసి పేదలను దోచుకున్నారని ఆరోపించారు.  సమావేశంలో రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి, ఆయా కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్​, మానాల మోహన్​రెడ్డి, అన్వేష్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశవేణు, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, డి.రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, నగేష్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి తదితరులు   పాల్గొన్నారు.