
గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్– ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, నల్గొండ– ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ ( ఫిబ్రవరి 25 ) సాయంత్రం 4 గంటలకు గడువు ముగిసింది. దీంతో ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఈ పోలింగ్ కి ఇప్పటికే అని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు:
పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
- 93 కామన్ పోలింగ్ స్టేషన్లు( టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ),
- 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు,
- 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లు,
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 210 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు
- జగిత్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలు: 51
- కరీంనగర్ జిల్లాలో : 85
- రాజన్న సిరిసిల్ల : 28
- పెద్దపల్లి : 36
- హనుమకొండ, సిద్ధిపేట, భూపాలపల్లి జిల్లాలో మరో 10 కేంద్రాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు: 65
- జగిత్యాల జిల్లాలో: 20
- పెద్దపల్లి జిల్లాలో: 14
- కరీంనగర్ : 18
- రాజన్న సిరిసిల్ల -13
- హనుమకొండ, సిద్ధిపేట, భూపాలపల్లి జిల్లాలో మరో 9 కేంద్రాలు