ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయి

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయి
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ  

కామారెడ్డి, వెలుగు :  ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు తెలంగాణ భవిష్యత్​ను నిర్దేశిస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్​నగర్​ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. కరీంనగర్​గ్రాడ్యుయేట్, టీచర్​ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తరఫున సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించి అడ్వకేట్లను, లైబ్రరీలో గ్రాడ్యుయేట్లను కలిసిన అనంతరం పార్టీ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణలో భవిష్యత్ లో  డబుల్​ఇంజన్​సర్కారు రావాలని  ప్రజల ఆకాంక్షిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు  గెలిపించాలని ఆమె కోరారు.  పార్టీ జిల్లా ప్రెసిడెంట్​నీలంచిన్న రాజులు,  జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార,  తదితరులు పాల్గొన్నారు.