పదేళ్లు పాటు మీరు ఏం చేశారు..? బీఆర్ఎస్‎పై జీవన్ రెడ్డి ఫైర్

పదేళ్లు పాటు మీరు ఏం చేశారు..? బీఆర్ఎస్‎పై జీవన్ రెడ్డి ఫైర్

జగిత్యాల: రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పుడు ఎందుకు సెక్రటేరియట్‎లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సెక్రటేరియట్‎లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో  భిన్నాభిప్రాయం లేదని.. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి స్టాట్చ్యూ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి కానీ.. విమర్శలు చేయకూడదని హితవు పలికారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలనే భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం హర్షణీమని అన్నారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఉత్తర తెలంగాణలో ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలకు నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. 

Also Read:-సీఎం రేవంత్వి పచ్చి అబద్ధాలు