
- రాష్ట్రంలో రాబోయేది సెక్యులర్ సర్కారే ఎమ్మెల్సీ కవిత కామెంట్
నిజామాబాద్, వెలుగు: బీఆర్ఆస్అధినేత కేసీఆర్ ను తలవకుండా సీఎం రేవంత్రెడ్డికి రోజు కూడా గడవదని, కలలో కూడా ఆయన పేరునే జపిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్లో ఆమె ఇఫ్తార్విందుకు హాజరై మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రకటించిన స్కీమ్ లు ఒక్కొక్కటి క్లోజ్చేస్తున్నారని విమర్శించారు.
పంటలకు సాగునీరు కూడా ఇవ్వక సోది మాటలతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సాధించి హిస్టరీలో నిలబడిన కేసీఆరే స్టేట్ఫ్యూచర్అని ఆయన బలం రోజురోజుకు పెరుగుతుందన్నారు. కేసీఆర్మాట్లాడితే జనం టీవీల ముందు కూర్చుంటారని, రేవంత్రెడ్డి మాట్లాడితే టీవీలు మ్యూట్చేస్తున్నరని ఎద్దేవా చేశారు.
ఎవరైనా తమ చేతలతో ప్రజల గౌరవం పొందుతారని, కేసీఆర్కు రేవంత్రెడ్డి ఎక్కడా సరితూగర న్నారు. రాష్ట్రంలో తిరిగి కేసీఆర్నాయకత్వంలో సెక్యూలర్సర్కారు రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం ముస్లింలకు రంజాన్తోఫా ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్జిల్లా ప్రెసిడెంట్ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.