హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలా చట్టం చేస్తే మద్దతు ఇస్తామని తెలిపారు. బుధవారం కవిత తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు.
అనంతరం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా శంఖారావం కార్యక్రమం పోస్టర్ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా నష్టం ఉండదన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలన్నారు.