
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam )దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎప్పుడు ఎవర్నీ అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు రావడంతో అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు రామచంద్ర పిళ్ళైని (Pillai) అరెస్టు చేశారు. స్కాం బయటపడిన దగ్గర నుండి పాత్రదారులు, సూత్రధారుల్లో పిళ్ళై పేరు ప్రముఖంగానే వినిపించింది. కవితను కూడా ఈడీ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అమె కూడా అరెస్ట్ కు మానసికంగా సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నారు. ఈ మధ్యే ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. తనను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి జనాల ముందుకు వెళ్తానని చెప్పారు. జరిగిన విషయాలను జనాలకు చెప్పుకోవడం తప్ప తనకు మరో అప్షన్ లేదన్నారు. అంటే ఏదోఒక రోజు కవిత అరెస్ట్ కూడా తప్పదని ఆమెకు తెలసని స్పష్టమవుతోంది. ఎందుకంటే అరెస్ట్ అయిన పిళ్లై తాను కవిత ప్రతినిధిగా ఈడీ అధికారులకు చెప్పారని తెలుస్తోంది.
గతేడాది ప్రవేశపెట్టిన ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor)లో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చింది. ఢిల్లీ కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో ఈ స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి.. సమగ్రంగా నివేదిక రూపొందించి.. సీఎస్ నరేష్ కుమార్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు. జూలైలో ఈ కేసును.. సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. అయితే అదే సమయంలో కొత్త పాలసీతో ఆదాయం పెరగడం లేదని కేజ్రీవాల్ ప్రభుత్వం.రద్దు చేసింది.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలక విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మనిష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి.. కోటి రూపాయలు తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేసి.. లంచాలు ఇచ్చినట్టుగా గుర్తించారు. ఈ స్కామ్ లో సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. ఇక అక్కడ నుంచి ఈ కేసుకు సంబంధించి.. కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో అరెస్టు అయిన అమిత్ అరోరా.. రిమాండ్ రిపోర్టు(Remand Report)లోనే మూడుసార్లు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది సీబీఐ.
రూ.100 కోట్ల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
రూ.100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్కు చేర్చినట్టుగా ఈడీ గుర్తించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో అరబిందో శరత్ రెడ్డి(Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.