మహిళా దినోత్సవంలోపు హామీలు అమలు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

మహిళా దినోత్సవంలోపు హామీలు అమలు చేయాలి : ఎమ్మెల్సీ కవిత
  • లేకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తం

హైదరాబాద్, వెలుగు: మహిళలకు కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. 

మంగళవారం ఆమె తన నివాసంలో జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్​ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని కవిత విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తమన్న హామీని కాంగ్రెస్ అమలు చేయకపోవడం దారుణమన్నారు.