ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

ఈ నెల 10న చెన్నైకి  ఎమ్మెల్సీ కవిత

ఈ నెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో "2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు ?" అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొంటారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను.. ఈ వేదిక ద్వారా కవిత చాటి చెప్పనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు.  సోమవారం నాడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాజికంగా జరిగే లాభాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై చూపించే సానుకూల ప్రభావం గురించి ఆమె వివరించనున్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.