వరద బాధితులను ఆదుకోవాలి : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్

వరద బాధితులను ఆదుకోవాలి : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండ రామ్ కోరారు. మహబూబాబాద్​జిల్లా గార్ల మండలంలోని మున్నేరువాగును గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్​నలంద కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. మున్నేరుపై హైలేవల్ బ్రిడ్జి లేకపోవడంతో మండలంలోని 25 గ్రామాల ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డోలి సత్యనారాయణ, అంబడి శ్రీనివాస్​, సుధాకర్,  గోపగాని శంకర్రావు, మురళి, తారక రామారావు తదితరులు ఉన్నారు.