చదువుతోనే సామాజిక మార్పు : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్

చదువుతోనే సామాజిక మార్పు : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్

షాద్ నగర్, వెలుగు: సమాజంలో మార్పుకు విద్య ఎంతో కీలకమని, చదువుతోనే సామాజిక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్త భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. దురదృష్టవశాత్తు సమాజంలో నేడు విద్య అంగడి సరుకు అయ్యిందన్నారు. విద్యకు పెద్దపీట వేసిన నాడే సమాజంలో మార్పు లభిస్తుందని, అన్నింటికీ విద్య ముఖ్యమని అన్నారు. 

షాద్ నగర్​లో దాతల సహకారంతో దాదాపు రూ.10 కోట్ల అంచనాలతో కాలేజీ భవనం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తలపెట్టిన ఈ కార్యక్రమం బృహత్తర యజ్ఞం లాంటిదని కొనియాడారు. ఇందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీశ్వ కిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు మామిడి శ్యామసుందర్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కందివనం సూర్యప్రకాశ్, కాలేజీ ప్రిన్సిపల్ సర్వేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తదితరులున్నారు .