
ములుగు, వెలుగు : మెదక్ బీఆర్ఎస్ఎంపీ క్యాండిడేట్గా ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పేరు ప్రకటించారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదేళ్లుగా ప్రభుత్వ అధికారిగా ప్రజలతో మమేకమై పని చేశానన్నారు. అందుకే కేసీఆర్, హరీశ్ రావు తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.