
రాష్ర్టంలోని మోడల్స్కూళ్లలో 2020–21 విద్యాసంవత్సరానికి గాను మంగళవారం అడ్మిషన్ నోటిఫికేషన్జారీకానున్నది. ఆరో తరగతితో పాటు సెవెన్త్ నుంచి టెన్త్వరకూ ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అడ్మిషన్షెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ అడిషనల్డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్పేమెంట్స్ను ఆరో తరగతికి ఫిబ్రవరి3 నుంచి 29 వరకూ, సెవెన్త్నుంచి పదో తరగతి వరకూ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకూ తీసుకోనున్నారు. ఆరో తరగతికి ఫిబ్రవరి 4 నుంచి 29 వరకూ, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకూ ఆన్లైన్లో అప్లికేషన్స్ను స్వీకరించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్12న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం10 నుంచి మధ్యాహ్నం12 వరకూ ఆరో తరగతి ఎంట్రెన్స్కు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఏడు నుంచి పదో తరగతి అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 9 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 5న ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 27న సెలెక్షన్లిస్టు విడుదల చేసి, మే 28 నుంచి31 వరకూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.