ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్

ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ కు 15 వేల మంది మనోళ్లను మోదీ ప్రభుత్వం పంపుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘‘ఇంతకుముందు చాలామంది దేశ యువత ఏజెంట్ల చేతుల్లో మోసపోయి రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్​కు మనోళ్లను పంపుతున్నది. ఇది చాలా దారుణం” అని ట్వీట్ చేశారు. ‘‘మోదీ సర్కార్​లో నిరుద్యోగం దారుణంగా పెరిగిందనడానికి ఈ ఘటనలే నిదర్శనం. ఉపాధి కోసం మన దేశ  పౌరులు యుద్ధ భూమిలోకి కూడా వెళ్తున్నారు. వాళ్ల ప్రాణాలనే పణంగాపెడుతున్నారు” అని పేర్కొన్నారు.