
రాయికల్, వెలుగు : కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ హయాంలో ఎక్కువగా రైతులు, యువకులు, రైతు కూలీలే నష్టపోయారని, కేంద్రం పేదలను దోచి బడా వ్యాపారవేత్తలకు పంచి పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్లో బుధవారం మాట్లాడుతూ జగిత్యాల సభలో ప్రధానమంత్రి మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారని, అప్పుడున్న మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ విద్యాసాగర్రావు పట్టించుకోలేదన్నారు. పసుపు రైతులకు ఇప్పటికైనా బోర్డు ఏర్పాటుపై స్పష్టతనివ్వాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు. నిజామాబాద్లోక్సభ అభ్యర్థి విషయంలో చర్చలు జరుగుతున్నాయని, తాను పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు హైకమాండ్దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.