![రసాభాస : రాజ్యసభలో మోదీ ప్రసంగం.. సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు](https://static.v6velugu.com/uploads/2024/07/modi-speech-in-rajya-sabha-opposition-mps-are-walk-out-from-the-session_ILgTQu6PEV.jpg)
తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు తమను పెద్దమనసుతో ఆశీర్వదించారని తెలిపారు. తమపై ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన విషప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తనలాంటి సామాన్యులు పార్లమెంట్ వరకు రాగలుగుతున్నారని చెప్పారు. రాజ్యసభలో మోదీ మాట్లాడారు. అయితే మోదీ ప్రసంగాన్ని అడుగడుగునా ఆటంకం నెలకొంది.
రాబోయే ఐదేండ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు. భారత అభివృద్ధి యాత్రలో సరికొత్త పధాలను లిఖించబోతున్నామని తెలిపారు. టెక్నాలజి శతాబ్దిలో మరింత ముందుకు వెళ్తామన్నారు. భారత్ ను మూడో ఆర్థిక శక్తిగా నిర్మించబోతున్నామన్నారు. మోదీ స్పీచ్ ఇస్తుండగానే విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.